అమరావతి: అగ్రికల్చర్ మిషన్ వైస్ చైర్మన్గా ఎంవీఎస్ నాగిరెడ్డి బాధ్యత స్వీకరించారు. ఈ మేరకు ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ప్రతి రైతు సమస్యను సీఎం వైయస్ జగన్ దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తానన్నారు. రైతులు ఎప్పుడైనా సమస్యలు చెప్పుకునేలా అగ్రి మిషన్ను రూపొందిస్తున్నామని వివరించారు. రైతుల సమస్యలపై ప్రతి నెలా సీఎం వైయస్ జగన్తో సమావేశం ఉంటుంది.