100 కుటుంబాలు వైయస్ఆర్సీపీలో చేరిక
31 Jul, 2023 14:23 IST
నెల్లూరు: ముఖ్యమంత్రి వై.యస్ జగన్ మోహన్ రెడ్డి పేద ప్రజలు అందిస్తున్న సంక్షేమ పథకాలకు ఆకర్షితులై కొవూరు నియోజకవర్గంలో వంద కుటుంబాలు వైయస్ఆర్సీపీలో చేరాయి. ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్నకుమార్రెడ్డి చేస్తున్న అభివృద్ధిలో భాగస్వాములు అవ్వాలనే ఆలోచనతో ఉప సర్పంచ్ భీమవరపు కృష్ణారెడ్డి , కొత్తూరు సర్పంచ్ ఈగ విజయమ్మ, వార్డు మెంబర్లు గ్రామంలో దాదాపు 100 కుటుంబాలు తెలుగుదేశం పార్టీ కి రాజీనామా చేశారు. సోమవారం కొత్తూరు గ్రామంలో కోవురు శాసనసభ్యులు నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి సమక్షంలో వైయస్ఆర్సీపీ తీర్థం పుచ్చుకున్నారు. వీరికి కండువాలు కప్పి ప్రసన్నకుమార్రెడ్డి పార్టీలో సాదరంగా ఆహ్వానించారు. కార్యక్రమంలో కోవూరు నియోజవర్గ యువజన భాగం అధ్యక్షులు నల్లపరెడ్డి రజత్ కుమార్ రెడ్డి, మండల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.