వైయస్ఆర్‌సీపీలో నూతన నియామకాలు 

7 Sep, 2025 09:36 IST

తాడేపల్లి: వైయస్ఆర్ కాంగ్రెస్‌ పార్టీలో పదవుల భర్తీలో భాగంగా పలు నియామకాలను ఆ పార్టీ అధినేత, మాజీ సీఎం వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి చేపట్టారు. ఆయన ఆదేశాల మేరకు నూతనంగా రాష్ట్ర రైతు విభాగం వర్కింగ్ ప్రెసిడెంట్లను నియమిస్తూ.. వైయస్ఆర్‌సీపీ కేంద్ర కార్యాలయం ప్రకటన విడుదల చేసింది.

 జోన్-1 వర్కింగ్ ప్రెసిడెంట్‌గా గొంటు రఘురామ్ (శ్రీకాకుళం), 
జోన్-2 వర్కింగ్ ప్రెసిడెంట్‌గా బూరుగుపల్లి సుబ్బారావు (తూర్పుగోదావరి), 
జోన్-3 వర్కింగ్‌ ప్రెసిడెంట్‌గా సింహాద్రి రమేష్ బాబు (కృష్ణాజిల్లా), 
జోన్-4 వర్కింగ్ ప్రెసిడెంట్‌గా ఎనుముల మారుతి ప్రసాద్‌రెడ్డి (ప్రకాశం), 
జోన్-5 వర్కింగ్ ప్రెసిడెంట్‌గా వంగల భరత్‌ కుమార్‌రెడ్డి (కర్నూలు), 
ఆక్వా కల్చర్‌కు వర్కింగ్ ప్రెసిడెంట్‌గా వడ్డి రఘురామ్ (పశ్చిమ గోదావరి) నియమితులయ్యారు.