హైదరాబాద్: అన్ని ప్రాంతాలకు తాగునీరు, సాగునీరు అందాలంటే పోలవరం ప్రాజెక్టుని సాధించుకోవటమే పరిష్కారం. అది మాత్రమే శాశ్వత పరిష్కారం చూపగలుగుతున్నది. పట్టిసీమ తో తాత్కాలికంగా నీళ్లు పారినా ఎప్పటికీ అనర్థం తప్పదు.
పట్టిసీమతో అనర్థాలు
- ఇది పూర్తిగా తాత్కాలిక ఎత్తిపోతల పథకం. ఇక్కడ నిధులు వృధా
- నీటిని నిల్వ చేసుకొనే అవకాశం లేదు. దీంతో వరద నీటి వృధా ను అరికట్టలేదు.
- ఏడాది పొడవునా నీటిని తోడితే గోదావరి జిల్లాలకు ఇబ్బంది తప్పదు
- ప్రకాశం బ్యారేజ్ లో అదనంగా నీటిని నిల్వ చేసే వెసులుబాటు లేదు
- ఎత్తిపోసిన నీటిని సముద్రం పాలు చేయాల్సి వస్తుంది
- కాంట్రాక్టర్ల ఎంపికలోనే అక్రమాలు. ఇద్దరికే అవకాశం
- 16.9 శాతం బోనస్ ఇచ్చేట్లుగా ముందుగానే ఒప్పందం
- పోలవరం పూర్తయితే ఈ ఖర్చంతా వృధా అయినట్లే.
పోలవరంతో ఉపయోగాలు
- ఇందులో రిజర్వాయర్ అవకాశం ఉంది. దీంతో గోదావరి కి వచ్చే వరద నీటిని నిల్వ చేసుకొనే వెసులుబాటు.
- ఏడాది పొడవునా నీటిని ఉపయోగించుకొనే వెసులుబాటు
- నీటిని కృష్ణా నదికి క్రమం తప్పకుండా పంపించుకొనే అవకాశం
- సముద్రంలో వృధాగా పోయే నీటికి అడ్డుకట్ట
- కృష్ణా డెల్టాకు నీరు దక్కే అవకాశం
- గోదావరి జిల్లాల తాగు, సాగునీటికి అవకాశం
- రాయలసీమ కు నీరు అందించే అవకాశః
- రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలకు నీరు వచ్చే చాన్సు