హైదరాబాద్ : నేడు మాతృ దినోత్సవం సందర్భంగా వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. ఆదివారం(మే 12) మదర్స్ డే సందర్భంగా ఆయన ట్వీట్ చేశారు. ‘అమ్మ ప్రతి నిత్యం తన పిల్లలకు మార్గదర్శకురాలు. ప్రతి తల్లికి మాతృ దినోత్సవ శుభాకాంక్షలు’ అని వైయస్ జగన్ పేర్కొన్నారు.