వైఎస్ విజయమ్మ_ భద్రిరాజు కృష్ణమూర్తి మరణం పట్ల_తీవ్ర దిగ్బ్రాంతిని వ్యక్తం చేశారు_11-08-2012

11 Aug, 2012 10:07 IST

                                       తేది:11-08-2012
అంతర్జాతీయ ప్రఖ్యాతి గడించిన ప్రముఖ భాషా శాస్త్రవేత్త శ్రీ భద్రిరాజు కృష్ణమూర్తి మరణం పట్ల వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గౌరవ అధ్యక్షురాలు శ్రీమతి వైఎస్ విజయమ్మ తీవ్ర దిగ్బ్రాంతిని వ్యక్తం చేశారు.ద్రవిడ బాషావేత్తల్లో ధ్రువ తార రాలిపోయిందని ఆమె తన సంతాపాన్ని ప్రకటించారు.ప్రపంచ ప్రఖ్యాతి కేంబ్రిడ్జి,ఆక్స్‌పర్డ్ విశ్వ విద్యాలయాలు ద్రవిడ బాషలపై ఆయన మౌలిక పరిశోధనల గ్రంధాలను ప్రచురించిన విషయాన్ని విజయమ్మ గుర్తు చేసుకున్నారు.ఆయన తెలుగు భాషా దిగ్గజాలకే ఆది గురువు అన్నారు.ఆయన కుటుంబానికి తనప్రగాడ సానుభూతిని తెలియచేసారు.