వరంగల్ మైనార్టీ సెల్ కన్వీనర్గా సయ్యద్ మసూద్
28 Sep, 2012 06:42 IST
హైదరాబాద్, 28 సెప్టెంబర్ 2012: వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మైనార్టీ సెల్ వరంగల్ జిల్లా కన్వీనర్గా సయ్యద్ మసూద్ను నియమించినట్లు పార్టీ అధికార ప్రతినిధి హెచ్ఎ రెహ్మాన్ ఒక ప్రకటనలో వెల్లడించారు. పార్టీ కేంద్ర కార్యాయంలో శుక్రవారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన ఈ విషయం తెలిపారు. తమ పార్టీ అధినేత వైయస్ జగన్మోహన్రెడ్డి ఆదేశం మేరకు మసూద్ను నియమించినట్లు రెహ్మాన్ వివరించారు.