పిన్నమనేని మృతికి విజయమ్మ సంతాపం

28 Sep, 2012 02:19 IST
హైదరాబాద్‌, 27 సెప్టెంబర్‌ 2012: కృష్ణా జిల్లా పరిషత్ మాజీ చైర్మన్ పిన్నమనేని కోటేశ్వరరావు మృతి పట్ల వై‌యస్‌ఆర్ కాంగ్రె‌స్ పార్టీ గౌరవ అధ్యక్షురాలు వై‌యస్‌ విజయమ్మ ప్రగాఢ సంతాపం వ్యక్తం చేశారు. పిన్నమనేని రాజకీయాల్లో హుందాగా వ్యవహరించారని, ప్రజల సంక్షేమం నిరంతరం పాటుపడ్డారని తన ఒక ప్రకటనలో ఆమె నివాళి అర్పించారు.