మహిళా విభాగం రాష్ట్ర కమిటీలో కొత్త సభ్యులు

25 Dec, 2013 10:14 IST
హైదరాబాద్ :

వైయస్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ మహిళా విభాగం రాష్ట్ర కమిటీ సభ్యులుగా జి.వి.సునీత, అరుణారెడ్డి, టి.కామేశ్వరి, కొల్ల గంగాభవాని, వై.దమయంతి, ముగడ గంగమ్మ, చెన్ను విజయ, గంగడ సుజాత నియమితులయ్యారు. పార్టీ అధినేత శ్రీ వైయస్ జగన్మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు ఈ నియామకాలు చేసినట్లు పార్టీ మహిళా విభాగం అధ్యక్షురాలు కొల్లి నిర్మల కుమారి తెలిపారు. కాగా, రాష్ట్ర ప్రచార కమిటీ సభ్యునిగా వెన్నా సత్యనారాయణరెడ్డిని నియమించినట్లు రాష్ట్ర కో ఆర్డినేటర్ టీఎస్‌ విజ‌య్‌చందర్ ‌తెలిపారు.

పార్టీ న్యాయ విభాగంలోకి జయరాం :
వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ న్యాయ విభాగం రాష్ట్ర కమిటీలో గువ్వాజి జయరాం‌ యాదవ్‌ను నియమించినట్లు రాష్ట్ర కన్వీనర్ చిత్తర్వు నాగేశ్వరరావు ‌వెల్లడించారు. పార్టీ అధ్యక్షుడు శ్రీ వైయస్ జగన్మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు యాదవ్‌ను నియమించినట్లు ఆయన తెలిపారు.