పర్చురు నియోజకవర్గ సమన్వయకర్తగా గాదె మధుసూదన్రెడ్డి
1 Jan, 2025 12:47 IST
తాడేపల్లి: వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్ మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు పర్చురు అసెంబ్లీ నియోజకవర్గ సమన్వయకర్తగా గాదె మధుసూదన్రెడ్డిని నియమించారు. ఈ మేరకు పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి ఓ ప్రకటన విడుదల చేశారు. గాదె మధుసూదన్రెడ్డి నియామకం పట్ల నియోజకవర్గ నాయకులు, కార్యకర్తలు హర్షం వ్యక్తం చేశారు. సమన్వయంతో పని చేసి పార్టీని బలోపేతం చేస్తామని వైయస్ఆర్సీపీ నాయకులు పేర్కొన్నారు.