సిజిసి సభ్యులుగా దాడి, బొగ్గు నియామకం
17 Aug, 2013 10:18 IST
హైదరాబాద్ :
వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర పాలక మండలి సభ్యులుగా సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి దాడి వీరభద్రరావు, బొగ్గు లక్ష్మణరావు నియమితులయ్యారు. పార్టీ అధినేత శ్రీ వైయస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు వీరిని సిజిసి సభ్యులుగా నియమించినట్లు శుక్రవారంనాడు వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయం ఒక ప్రకటనలో పేర్కొంది.