ఆంధ్రప్రదేశ్ లో ఆత్మహత్యలకు నిరసనగా వైయస్ఆర్ కాంగ్రెస్ విద్యార్ధి విభాగం ఈనెల 16 వ తేదీన అన్ని కార్పొరేట్ విద్యా సంస్థల బంద్ కు పిలుపునిచ్చింది.మూడేళ్లుగా కార్పొరేట్ విద్యా సంస్థల్లో అనేక మంది విద్యార్ధులు బలవన్మరణాలకు పాల్పడుతున్నా ప్రభుత్వం విచారణకు ఆదేశించకుండా, ఆయా కాలేజీల యాజమాన్యాలపై చర్యలు తీసుకోకపోవడంపై విద్యార్ధి విభాగం మండిపడింది.