వైయస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ నూతన కార్యదర్శులుగా వివిధ జిల్లాలకు చెందిన 34 మందిని పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్ మోహన్ రెడ్డి నియమించారు. గత జూలైలో జరిగిన పార్టీ జాతీయ ప్లీనరీతో గతంలో నియమించిన కార్యదర్శుల పదవీ కాలం పూర్తి అయిన నేపథ్యంలో కొత్త నియామకాలు చేసినట్లు పార్టీ కేంద్ర కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది.