స్పీకర్ : అంబటిరాంబాబు - మే17,2012
ఈ రోజు హైకోర్టులో ప్రభుత్వం అర్ధరాత్రిపూట హడవిడిగా సాక్షి టెలివిజన్, సాక్షి పేపర్కు గవర్నమెంట్ అడ్యడైజ్ మెంట్లను ఇవ్వకూడదని విడుదల చేసిన జీఒని హై కోర్టు స్టే ఇచ్చింది.. మా పోరాటం ఇలానే కొనసాగుతుంది.
గత రెండు రోజున నుండి సాక్షి కి సంబందించిన అస్తులను ఎటాచ్ చేయబోతున్నారని ఒక వర్గం మీడియా శివతాండవం చేస్తుంది. మొదటి పేజిల్లో భయంకరమైన స్టోరిలు నడుపుతుంది. సాక్షిని మూసివేయబోతున్నారని భావనతో ముఖ్యంగా ఈనాడు , ఆంధ్రజ్యోతి రాధాకృష్ట పిచ్చిపిచ్చి గా రాతలు రాస్తున్నారు.వారు ఎప్పటినుండో సాక్షి పై కక్ష కట్టిన వ్యక్తులు. ప్రభుత్వం అకౌంట్స్ సీజ్ చేస్తే సాక్షిని మూసివేస్తారని సంకేతాలు పంపడానికి ప్రయత్నం చేస్తున్నారు. అలాగే జగన్మోహన్రెడ్డి గారి సంస్ధలన్ని కూడ టేకోవర్ చేసుకోబోతున్నారని, మూసివేయబోతున్నారని త్వరలో జగన్మోహన్రెడ్డిని అరెస్ట్ చేయబోతున్నారని మాటలు మాట్లాడుతున్నారు. ఇది ప్రజాస్వామ్య దేశం అంతిమంగా న్యాయమే గెలుస్తుంది.
సీబీఐ ఎంక్యరిదేని మీద జరుగుతుంది.26 జీఓలు రాజశేఖరరెడ్డిగారి టైంలో అక్రమంగా విడుదలచేశారని దాని మీద జరుగుతుంది. జీఓలు విడుదల చేసిన మంత్రులు మాత్రం క్షేమంగా ఉన్నారు.....అదే జగన్మోహన్రెడ్డి మీద దాడి చేయడానికి ప్రయత్నంచేస్తున్నారు. ఇంతవరకు26 జీఓల్లో తప్పు ఉన్నదా,క్యిట్ ప్రోకో జరిగిందా అనితేలలేదు. సాక్షి గోంతునోక్కడానికి ఈనాడు. ఆంధ్రజ్యోతి ప్రయత్నం చేస్తున్నాయి. మీరు నిజంగా జగన్మోహన్ రెడ్డిగారి కంపెనిల్లో పెట్టినటువంటి పెట్టుబడులు అక్రమమో సక్రమమో తేల్చవలసిన మీరు అక్రమమా సక్రమమా అని మాట్లాడుకోకుండా సాక్షి గోంతు నోక్కేస్తే జగన్మోహన్రెడ్డి గారి మాటలను ప్రజలువినలేరని ఉప ఎన్నికల్లో కోలుకోవచ్చఅని వాయిలార్ రవి వచ్చినదగ్గర నుండి ప్రయత్నంచేస్తున్నారు.
కాంగ్రెస్ పార్టీ వారు ఓ సర్వే చేయించుకున్నారు. సర్యే పేరు నిల్సన్ సర్వే, సర్వేలో ఒక్క నియోజకవర్గంలోకూడ కాంగ్రెస్ పార్టీ గెలిచే అవకాశంలేదని వారు గమనించిన తర్వాత, వారికి ప్రజామోద 31 శాతం ఉంది.