వచ్చేది రాజన్న రాజ్యమే...

24 Sep, 2018 11:02 IST

జననేత వైయస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి వలనే మళ్లీ రాజన్న రాజ్యం వస్తుందని ప్రజలందరూ బలంగా నమ్ముతున్నారని వైయస్‌ఆర్‌సీపీ మహిళా నేత వరుదు కల్యాణి అన్నారు. విశాఖ జిల్లాలో గత నెల 14 నుంచి నేటి వరుకు ప్రజా సంకల్పయాత్ర కొనసాగిందని స్థానికులందరూ జగనన్నకు కలిసి సమస్యలు చెప్పుకుని ఆయన భరోసా పొందుతున్నారన్నారు. వైయస్‌ జగన్‌ ఏ జిల్లాలో అడుగుపెట్టిన ప్రజలందరూ విశేషంగా బ్రహ్మరథం పడుతున్నారన్నారు. టీడీపీ పాలనలో ప్రజలు పడుతున్న కష్టాలు వర్ణణాతీతమన్నారు.