టీడీపీ నేతల అగడాలకు అడ్డూ అదుపు లేదు
25 May, 2018 18:36 IST
పశ్చిమ గోదావరి: టీడీపీ నేతల ఆగడాలకు అడ్డూ అదుపు లేదని వైయస్ఆర్సీపీ నేత వంకా రవీంద్రనాథ్ అన్నారు. ప్రజా సంకల్ప యాత్రలో భాగంగా శుక్రవారం ఆకివీడులో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. టీడీపీ ప్రతినిధులు గుండాలుగా వ్యవహరిస్తున్నారన్నారు. నిన్న కాకినాడ జిల్లా పరిషత్ సమావేశంలో టీడీపీ ఎమ్మెల్సీ రెడ్డి సుబ్రమణ్యం వైయస్ఆర్సీపీ ఎమ్మెల్యేపై దాడి చేయడం దారుణమన్నారు. వైయస్ జగన్కు ప్రతి ఒక్కరు మద్దతుగా నిలవాలని కోరారు.