మన సమస్యలు తీరాలంటే జగనన్న సీఎం కావాలి
20 Nov, 2018 16:20 IST
అరకు పార్లమెంట్ సమన్వయకర్త మాధవి
విజయనగరం: మనందరి సమస్యలు తీరాలంటే ముఖ్యమంత్రిగా వైయస్ జగన్ కావాలని అరకు పార్లమెంట్ సమన్వయకర్త మాధవి కోరారు. ఇందుకోసం అందరం నడుం బిగించి పని చేయాలన్నారు. ప్రతి ఒక్కరూ సైనికుల్లా పని చేయాలన్నారు. మీరంతా చదువుకోవాలంటే జగనన్న సీఎం కావాల్సిందే అన్నారు. వైయస్ఆర్సీపీ అధికారంలోకి వస్తే మన సమస్యలు తీరుతాయని చెప్పారు.