వైయస్‌ఆర్‌ మెమోరియల్‌ ఫౌండేషన్‌ క్యాలెండర్‌ ఆవిష్కరణ

21 Dec, 2017 15:28 IST
అనంతపురం: వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత వైయస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి చేపట్టిన ప్రజా సంకల్పయాత్ర 41వ రోజు దిగ్విజయంగా కొనసాగుతుంది. పుట్టపర్తి నియోజకవర్గం రాగినిపల్లి వద్ద కర్ణాటక వైయస్‌ఆర్‌ మెమోరియల్‌ ఫౌండేషన్‌ అధ్యక్షుడు భక్తవత్సలరెడ్డి, ఉపాధ్యక్షుడు విజయభాస్కర్‌రెడ్డిలు వైయస్‌ జగన్‌ చేతుల మీదుగా 2018 క్యాలెండర్‌ను ఆవిష్కరింపజేశారు.