విజయనగరంలో వైయస్‌ జగన్‌కు అపూర్వ స్వాగతం

1 Oct, 2018 12:00 IST
విజయనగరంః విజయనగరం పట్టణంలోకి వైయస్‌ జగన్‌ ప్రజా సంకల్పయాత్ర ప్రవేశించింది. వైయస్‌ జగన్‌కు ప్రజలు అపూర్వ స్వాగతం పలికారు.పులివేషాలు,కోలాటం, తప్పెటగుళ్లు, గరగ నృత్యాలతో విజయనగరంలో పండగ వాతావరణం నెలకొంది.  జనసంద్రంతో రహదారులన్నీ కిక్కిరిసిపోయాయి.జగనన్నను కలవాలి.. ఆయనకు మద్దతు తెలిపాలని లక్షలాది మంది ప్రజలు దారిపోడవునా బ్రహ్మరథం పడుతున్నారు