సబ్బవరం నుంచి 256వ రోజు ప్రజాసంకల్పయాత్ర ప్రారంభం
6 Sep, 2018 09:23 IST
విశాఖ : వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, జననేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర విశాఖ జిల్లాలో దిగ్విజయవంగా కొనసాగుతోంది. గురువారం ఉదయం జననేత వైయస్ జగన్ సబ్బవరం శివారు నుంచి 256వ రోజు పాదయాత్ర ప్రారంభించారు. అక్కడి నుంచి అమృతాపురం, ఇప్పవానిపాలెం మీదగా జెర్రిపోతులపాలెం వరకు వైయస్ జగన్ పాదయాత్ర కొనసాగుతోంది.