రాళ్లపాడు ప్రాజెక్టును పరిశీలించిన వైయస్ జగన్
16 Feb, 2018 12:00 IST
ప్రకాశం: ప్రజా సంకల్ప యాత్రలో భాగంగా వైయస్ జగన్ మోహన్ రెడ్డి ప్రకాశం జిల్లాలో ప్రధాన వ్యవసాయ ప్రాజెక్టు రాళ్లపాడును శుక్రవారం పరిశీలించారు. గత నాలుగేళ్లుగా నీరులేక తీవ్ర కరువు పరిస్థితులు ఎదుర్కొంటున్నామని రిజర్వాయర్ ఆయకట్టు మాజీ అధ్యక్షుడు నరసింహరావు వైయస్ జగన్కు వివరించారు. ఆయనతో పాటు వేలాది మంది స్థానికులు, పార్టీ కార్యకర్తలు రాళ్లపాడుకు చేరుకున్నారు.