జనసంద్రమైన ఏర్పేడు
20 Jan, 2018 17:07 IST
చిత్తూరు: వైయస్ జగన్మోహన్ రెడ్డి చేపట్టిన ప్రజా సంకల్ప యాత్ర చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తిలో కొనసాగుతోంది. కొద్దిసేపటి క్రితం వైయస్ జగన్ ఏర్పేడు మండల కేంద్రానికి వచ్చారు. జననేత రాకతో ఏర్పేడు జనసంద్రమైంది. ఈ సందర్భంగా స్థానికులు తమ సమస్యలను వైయస్ జగన్కు వివరిస్తున్నారు. తనను కలిసిన ప్రతి ఒక్కరికి వైయస్జగన్ ధైర్యం చెబుతూ ముందుకు సాగుతున్నారు.