గార్లదిన్నెలో సమస్యల వెల్లువ
9 Dec, 2017 16:33 IST
అనంతపురం: ప్రజా సంకల్ప యాత్రలో భాగంగా గార్లదిన్నె గ్రామానికి చేరుకున్న వైయస్ జగన్ మోహన్ రెడ్డికి గ్రామస్తులు సమస్యలు ఏకరువు పెట్టారు. పింఛన్లు రావడం లేదని, ఫీజులు అందడం లేదని, రుణాలు మాఫీ కావడం లేదని, గ్రామంలో రోడ్లు లేవని, మంచినీరు రావడం లేదని వైయస్ జగన్ దృష్టికి తీసుకెళ్లారు. మరో ఏడాది పాటు ఓపిక పడితే మంచి రోజులు వస్తాయని జననేత గ్రామస్తులకు భరోసా కల్పించారు.