చిట్టూరులో వైయస్ జగన్కు ఘన స్వాగతం
6 Dec, 2017 15:38 IST
అనంతపురం: ప్రజా సంకల్ప యాత్రలో భాగంగా తాడిపత్రి నియోజకవర్గంలోని చిట్టూరు గ్రామంలో వైయస్ జగన్ మోహన్ రెడ్డికి గ్రామస్తులు ఘన స్వాగతం పలికారు. రాజన్న బిడ్డ తమ గ్రామానికి రావడంతో స్థానికులు తమ సమస్యలు ఏకరువు పెట్టారు. ఊర్లో రోడ్లు లేవని, తాగేందుకు మంచినీళ్లు రావడం లేదని, పింఛన్లు ఇవ్వడం లేదని జననేతకు ఫిర్యాదు చేశారు.