వీరారెడ్డి పాలెం చేరుకున్న వైయస్ జగన్
13 Feb, 2018 11:35 IST
నెల్లూరు: ప్రజా సమస్యలు తెలుసుకునేందుకు పాదయాత్ర చేపట్టిన వైయస్ జగన్ మోహన్ రెడ్డి కొద్ది సేపటిక్రితమే వీరారెడ్డిపాలెం చేరుకున్నారు. ఈ సందర్భంగా గ్రామస్తులు, కార్యకర్తలు జననేతకు ఘన స్వాగతం పలికారు. తమ బాధలు చెప్పుకున్నారు. మనందరి ప్రభుత్వం వచ్చాక అందరికి న్యాయం చేస్తానని వైయస్ జగన్ హామీ ఇచ్చారు.