గంటావారిపల్లిలో వాటర్ ప్లాంట్ ప్రారంభం
10 Jan, 2018 12:13 IST
చిత్తూరు: ప్రజా సంకల్ప యాత్రలో భాగంగా గంటావారిపల్లెకు చేరుకున్న వైయస్ జగన్ మోహన్ రెడ్డి గ్రామంలో ఏర్పాటు చేసిన మినరల్ వాటర్ ప్లాంట్ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..మనందరి ప్రభుత్వం అధికారంలోకివచ్చాక తాగునీరు, సాగునీటికి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు. వైయస్ జగన్ రాకతో గ్రామంలో పండుగ వాతావరణం నెలకొంది.