వెలంపాలెంలో జననేతకు ఘన స్వాగతం
5 Jul, 2018 09:45 IST
తూర్పు గోదావరి: ప్రజా సంకల్ప యాత్రలో భాగంగా వైయస్ జగన్ గురువారం ద్రాక్షారామం నుంచి పాదయాత్ర ప్రారంభించి వెలంపాలెం చేరుకున్నారు. ఈ సందర్భంగా జననేతకు స్థానికులు, పార్టీ నాయకులు ఘన స్వాగతం పలికారు. తమ అభిమాన నేత వచ్చారని స్థానికులు పనులు మానుకొని, ఎదురెళ్లి స్వాగతం పలికారు. రాజన్న బిడ్డకు తమ బాధలు చెప్పుకుంటున్నారు. వారందరికీ వైయస్ జగన్ ధైర్యం చెబుతూ ముందుకు సాగుతున్నారు.