తారాపురంలో జననేతకు ఘన స్వాగతం
22 Oct, 2018 10:54 IST
విజయనగరం: ప్రజా సంకల్ప యాత్రలో భాగంగా 291వ రోజు వైయస్ జగన్ తారాపురం గ్రామానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా గ్రామస్తులు, పార్టీ నాయకులు ఘన స్వాగతం పలికారు. మా గ్రామానికి రోడ్డు నిర్మిస్తే రుణపడి ఉంటాం. ఎంతోమంది పాలకులు వచ్చినా మాకు రహదారి కష్టాలు తీరలేదు. అధికారులు కూడా పట్టించుకోవడం లేదు.అత్యవసర సమయాల్లో గ్రామానికి 108,104 కూడా రావడం లేదు. సమస్యను జగన్మోహన్రెడ్డి దృష్టికి తీసుకెళ్లాం.