సింగాయపాలెంలో జననేతకు ఘన స్వాగతం
30 Jun, 2018 10:26 IST
తూర్పు గోదావరి జిల్లా: ప్రజా సమస్యలు తెలుసుకునేందుకు వైయస్ జగన్ చేపట్టిన ప్రజా సంకల్ప యాత్ర విజయవంతంగా కొనసాగుతోంది. కొద్దిసేపటి క్రితం వైయస్ జగన్ సింగాయపాలెం చేరుకున్నారు. ఈ సందర్భంగా స్థానికులు, పార్టీ నాయకులు ఘన స్వాగతం పలికారు. గ్రామస్తులు తాము ఎదుర్కొంటున్న సమస్యలు వైయస్ జగన్కు వివరిస్తున్నారు. టీడీపీ దొంగ దీక్షలను నమ్మమని, మీ వెంటే ఉంటామని ప్రజలు వైయస్ జగన్తో చెబుతున్నారు.