రాతనలో పార్టీ జెండా ఆవిష్కరణ
2 Dec, 2017 10:36 IST
కర్నూలు: పత్తికొండ నియోజకవర్గంలోని రాతన గ్రామంలో వైయస్ జగన్ మోహన్ రెడ్డి వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండాను ఆవిష్కరించారు. ప్రజా సంకల్ప యాత్రలో భాగంగా తమ గ్రామానికి చేరుకున్న వైయస్ జగన్కు గ్రామస్తులు ఘన స్వాగతం పలికారు. పూలవర్షం కురిపించి అభిమానాన్ని చాటుకున్నారు. ఈ సంరద్భంగా గ్రామంలో నెలకొన్న సమస్యలపై వైయస్ జగన్కు వినతిపత్రం అందజేశారు.