పెంటపాడులో జననేతకు ఘన స్వాగతం
22 May, 2018 10:53 IST
పశ్చిమ గోదావరి: ప్రజా సంకల్ప యాత్రలో భాగంగా 168వ రోజు వైయస్ జగన్ మోహన్ రెడ్డి పశ్చిమ గోదావరి జిల్లాలోని పెంటపాడు గ్రామానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా జననేతకు పార్టీ నాయకులు, గ్రామస్తులు ఘన స్వాగతం పలికారు. పలువురు కాంట్రాక్ట్ కార్మికులు వైయస్ జగన్ను కలిసి తమ సమస్యలు వివరించారు. మరో ఏడాది ఓపిక పడితే మంచి రోజులు వస్తాయని జననేత భరోసా కల్పించారు.