జననేతను కలిసిన నెమ్మలగుంట గ్రామస్తులు

11 Jan, 2018 14:42 IST
గంగాధర నెల్లూరు: చంద్రబాబు పాలనలో అభివృద్ధి కుంటుపడిందని నెమ్మలగుంట వాసులు మండిపడ్డారు. ప్రజా సంకల్పయాత్రలో భాగంగా నెమ్మలగుంటకు వచ్చిన ప్రతిపక్షనేత వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి గ్రామస్తులు తమ సమస్యలు చెప్పుకున్నారు. సమస్యలు పరిష్కరించాలని  ఈ సందర్భంగా అధికారంలోకి వచ్చిన వెంటనే సమస్యలు పరిష్కరించాలని కోరుతూ.. జననేతకు వినతిపత్రం అందజేశారు. అనంతరం వారు మీడియాతో మాట్లాడుతూ.. రుణమాఫీ చేస్తానని మోసం చేశాడని, గ్రామానికి సరైన రోడ్లు లేవు, ఉపాధి హామీ పథకం అమలు చేయకపోవడంతో పూటగడవడం లేదన్నారు.