ములగపూడి చేరుకున్న వైయస్ జగన్
16 Aug, 2018 11:33 IST
విశాఖ: ప్రజా సంకల్ప యాత్రలో భాగంగా వైయస్ జగన్ మోహన్రెడ్డి 238వ రోజు పాదయాత్రను య్రరవల్లి జంక్షన్ నుంచి ప్రారంభించి కొద్ది సేపటి క్రితమే ములగపూడి చేరుకున్నారు. ఈ సందర్భంగా జననేతకు గ్రామస్తులు, పార్టీ నాయకులు ఘన స్వాగతం పలికారు. అడుగడుగునా బ్రహ్మరథం పడుతున్నారు. పాదయాత్ర దారులన్నీ కిక్కిరిసిపోతున్నాయి. ప్రజల సమస్యలు తెలుసుకుంటూ రాజన్న బిడ్డ ముందుకు సాగుతున్నారు.