మరిపివలసలో జననేతకు ఘన స్వాగతం
15 Nov, 2018 09:13 IST
విజయనగరం: ప్రజా సంకల్ప యాత్రలో భాగంగా వైయస్ జగన్ కొద్ది సేపటి క్రితం నిడుగల్లు క్రాస్ నుంచి మరిపివలస గ్రామానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా జననేతకు స్థానికులు, పార్టీ శ్రేణులు ఘన స్వాగతం పలికారు. గ్రామంలోని రోజువారీ కూలీలు వైయస్ జగన్ను కలిసి తమ బాధలు చెప్పుకున్నారు. ఉపాధి లేక వలస వెళ్తున్నామని వాపోయారు. వారి సమస్యలు విన్న వైయస్ జగన్ మంచి రోజులు వస్తాయని భరోసా కల్పించారు.