ప్రత్యేక హోదాకు విద్యార్థుల మద్దతు
11 Mar, 2018 10:29 IST
ప్రకాశం: వైయస్ జగన్ మోహన్ రెడ్డి చేపట్టిన ప్రత్యేక హోదా ఉద్యమానికి విద్యార్థులు మద్దతుగా నిలిచారు. ప్రజా సంకల్ప యాత్ర 109వ రోజు చీరాల నియోజకవర్గంలో కొనసాగుతోంది. కొత్తపేట మీదుగా ఆంధ్రకేసరి జూనియర్ కాలేజీకి చేరుకున్న వైయస్ జగన్ను విద్యార్థులు కలిసి ప్రత్యేక హోదా కోసం పోరాటం చేద్దామని, హోదా వస్తేనే మా భవిష్యత్తు బాగుంటుందని చెప్పారు. హోదా కోసం ఎంపీల రాజీనామాలకు సిద్ధపడిన జననేత ప్రకటనపై హర్షం వ్యక్తం చేశారు.