కడవకల్లులో కష్టాలు తెలుసుకున్న వైయస్ జగన్
28 Apr, 2018 13:20 IST
కృష్ణా జిల్లా: ప్రజా సంకల్ప యాత్రలో భాగంగా వైయస్ జగన్ మోహన్ రెడ్డి కడవకల్లు గ్రామానికి చేరుకొని స్థానికులతో మమేకమయ్యారు. ఈ సంరద్భంగా స్థానికులు తాము ఎదుర్కొంటున్న సమస్యలను వైయస్ జగన్ దృష్టికి తీసుకెళ్లారు. గ్రామంలో చేతివృత్తిదారులతో వైయస్ జగన్ మాట్లాడి వారి కష్టాలు తెలుసుకున్నారు. మరో ఏడాది ఓపిక పడితే మంచి రోజులు వస్తాయని జననేత హామీ ఇచ్చారు.