జొన్నవరంలో జనహారతి
13 Nov, 2017 11:12 IST
వైయస్ఆర్ జిల్లా: ప్రజాసంకల్పయాత్రలో భాగంగా జొన్నవరం గ్రామానికి చేరుకున్న వైయస్ జగన్ మోహన్ రెడ్డికి గ్రామస్తులు ఘన స్వాగతం పలికారు. సోమవారం ఉదయం దువ్వూరు నుంచి ప్రారంభమైన వైయస్ జగన్ పాదయాత్ర ఇక్కుపల్లి మీదుగా జొన్నవరం గ్రామానికి చేరుకుంది. ఈ సందర్భంగా మహిళలు వైయస్ జగన్కు తిలకం దిద్ది, హారతి పట్టారు. అనంతరం తమ డ్వాక్రా రుణాలు మాఫీ కాలేదని వైయస్ జగన్ దృష్టికి తెచ్చారు. యువకులు వైయస్ జగన్తో సెల్ఫీలు దిగేందుకు పోటీ పడ్డారు. పాదయాత్ర జిల్లెల, కనగూడూరు, ఇడమడకల మీదుగా సాగనుంది. కానగూడూరులో జెండా ఆవిష్కరణతో పాటు బీసీ నాయకులతో వైయస్ జగన్ ముఖాముఖీ కానున్నారు.