దొర్నిపాడుకు చేరుకున్న వైయస్ జగన్
16 Nov, 2017 16:21 IST
కర్నూలు: వైయస్ జగన్ మోహన్రెడ్డి చేపట్టిన ప్రజా సంకల్ప యాత్ర గురువారం మధ్యాహ్నం ఆళ్లగడ్డ నియోజకవర్గంలోని దొర్నిపాడు మండలంలోకి ప్రవేశించింది. ప్రజా సమస్యలు తెలుసుకుంటూ, ప్రజలతో మమేకమవుతున్న జననేత ఆళ్లగడ్డ నియోజకవర్గంలో ఈ నెల 14వ తేదీ నుంచి పర్యటిస్తున్నారు. ఇవాళ ఉదయం చింతకుంట, భాగ్యనగరం, దొర్నిపాడు, రామచంద్రాపురం క్రాస్ రోడ్డు, కొండాపురం మీదుగా పాత్రయాత్ర కొనసాగుతుంది. మరి కాసేపట్లో దొర్నపాడు మండల కేంద్రం చేరుకొని పార్టీ జెండా ఎగురవేస్తారు.