బసినేపల్లిలో పార్టీ జెండా ఆవిష్కరణ
4 Dec, 2017 10:27 IST
అనంతపురం: ప్రజా సమస్యలు తెలుసుకునేందుకు ప్రజా సంకల్ప యాత్ర చేపట్టిన వైయస్ జగన్ మోహన్ రెడ్డి ఇవాళ అనంతపురం జిల్లా నుంచి పాదయాత్ర ప్రారంభించారు. ఈ సందర్భంగా గ్రామస్తులు, పార్టీ శ్రేణులు వైయస్ జగన్కు అపూర్వ స్వాగతం పలికారు. అనంతరం గ్రామంలో ఏర్పాటు చేసిన కూడలిలో వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండాను వైయస్ జగన్ ఆవిష్కరించారు. గ్రామస్తులు తమ సమస్యలను జననేత దృష్టికి తీసుకెళ్లారు. తనను కలిసిన ప్రతి ఒక్కరికి వైయస్ జగన్ భరోసా కల్పించారు.