ఆకివీడు జనసంద్రం
25 May, 2018 16:50 IST
పశ్చిమ గోదావరి: ప్రజా సంకల్ప యాత్రలో భాగంగా 171వ రోజు పశ్చిమ గోదావరి జిల్లా ఉండి నియోజకవర్గంలో వైయస్ జగన్ పాదయాత్ర కొనసాగిస్తున్నారు. ఆకివీడులో ఏర్పాటు చేసిన బహిరంగ సభకు జనం అధిక సంఖ్యలో తరలిరావడంతో జనసంద్రంగా మారింది. జననేత వైయస్ జగన్ కొద్ది సేపట్లో ఆకివీడుకు చేరుకోనున్నారు.