అట్టలి నుంచి 308వ రోజు ప్రజాసంకల్పయాత్ర ప్రారంభం
28 Nov, 2018 09:26 IST
శ్రీకాకుళం: వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్షనేత వైయస్ జగన్మోహన్ రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర శ్రీకాకుళం జిల్లాలో విజయవంతంగా కొనసాగుతుంది. జననేత 308వ రోజు పాదయాత్రను బుధవారం ఉదయం అట్టలి నుంచి ప్రారంభించారు. అక్కడి నుంచి తమరాడ, తంపటాపల్లి క్రాస్, ఎల్ఎల్ పురం మీదుగా పాలకొండ ఆర్టీసీ కాంప్లెక్స్ వరకు వైఎస్ జగన్ పాదయాత్ర కొనసాగుతుంది. సాయంత్రం పాలకొండ ఆర్టీసీ కాంప్లెక్స్ సెంటర్లో జరిగే భారీ బహిరంగ సభలో జననేత ప్రజలనుద్దేశించి ప్రసంగించనున్నారు.
వైయస్ జగన్ రాకతో పాదయాత్ర సాగుతున్న మార్గంలో పండుగ వాతారణం నెలకొంది. ఎన్నాళ్లుగానో ఎదురు చూస్తున్న ఆ సంకల్ప సూరీడు తమ ప్రాంతానికి రానున్నాడనీ.. తమ జీవితాల్లోకి వెలుగులు తెచ్చేందుకు పాటుపడుతున్నాడనీ.. ఆయనతో తమ గోడు చెప్పుకుని గుండెల్లోని వేదన దింపుకోవచ్చునని జనం ఆరాట పడుతున్నారు. జననేత తమ ప్రాంతానికి ఎప్పుడు వస్తాడా అని ఎదురు చూస్తున్నారు.