తుమ్మికాపాలెం నుంచి 270వ రోజు ప్రజాసంకల్పయాత్ర ప్రారంభం
25 Sep, 2018 09:09 IST
విజయనగరం : వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్ మోహన్ రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్ప యాత్ర విశాఖపట్నం జిల్లాలో విజయవంతంగా ముగిసి విజయనగరానికి చేరింది. మంగళవారం జననేత పాదయాత్రను ఎస్. కోట నియోజకవర్గంలోని కొత్తవలస మండలం తుమ్మికాపాలెం నుంచి ప్రారంభించారు. అక్కడ నుంచి అడ్డుపాలెం, నిమ్మపాలెం, అప్పన్నపాలెం, గాంధీనగర్, గంగుపుడి జంక్షన్ మీదుగా మళ్లివీడుకు చేరుకుంటారు. అక్కడ మధ్యాహ్న విరామం తీసుకుంటారు. అనంతరం గొల్డ్స్టార్ జంక్షన్, జమ్మదేవి పేట, రంగపురం క్రాస్ మీదుగా రంగరాయపురం వరకూ ప్రజాసంకల్పయాత్ర కొనసాగనుంది.