కైలాసపట్నం నుంచి 242వ రోజు ప్రజాసంకల్పయాత్ర ప్రారంభం

21 Aug, 2018 09:25 IST
విశాఖ‌: వైయ‌స్ఆర్ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షులు, జననేత వైయ‌స్‌ జగన్‌మోహన్‌ రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర  విశాఖపట్నం జిల్లాలో విజయవంతంగా కొనసాగుతోంది. మంగ‌ళ‌వారం ఉదయం జననేత పాయకరావుపేట నియోజకవర్గం కైలాసపట్నం శివారు నుంచి వైయ‌స్ జ‌గ‌న్‌ పాదయాత్రను ప్రారంభించారు. అక్కడి నుంచి చౌడువాడ క్రాస్‌, గొట్టివాడ, పండూరు క్రాస్‌ మీదుగా రామచంద్రపురం క్రాస్‌ వరకు పాదయాత్ర కొనసాగుతుంది.   లంచ్‌ విరామం అనంత‌రం మధ్యాహ్నం 2.45 గంటల సమయంలో పాదయాత్ర పునః ప్రారంభమవుతుంది. దార్లపూడి జంక్షన్‌ మీదుగా దార్లపూడి వరకు జననేత పాదయాత్ర కొనసాగనుంది.