నాలుగు విడ‌త‌లుగా డ్వాక్రా రుణాల‌న్నీ మాఫీ చేస్తా

18 Nov, 2017 13:10 IST
కర్నూలు జిల్లా బనగానపల్లె నియోజకవర్గం దొర్నిపాడు మండలం.. కంపమెళ్లమెట్ట గ్రామానికి చేరుకున్న ప్రతిపక్ష నాయకుడు వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి. జగన్‌ రాకతో భారీగా తరలివచ్చిన జనం. అడుగడుగునా జగన్‌కు నీరాజనాలు పట్టిన గ్రామస్తులు. రుణమాఫీ గురించి అడిగిన జగన్‌.. ఒక్క రూపాయి కూడా రుణమాఫీ కాలేదని వాపోయిన రైతులు. జననేతను కలిసిన మహిళా కూలీలు. కూలీ రేట్లు గురించి అడిగిన వైయస్‌ జగన్‌. పిల్లలను చదవించండి.. మీకు మేము అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. పొదుపు సంఘాల రుణాలన్నీ నాలుగు విడతలుగా మొత్తం మాఫీ చేస్తాం.