వైయస్ జగన్ను కలిసిన విద్యార్థి జేఏసీ నేతలు
20 Nov, 2017 16:18 IST
కర్నూలు: వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్ మోహన్ రెడ్డిని విద్యార్థి జేఏసీ నేతలు కలిశారు. ప్రజా సంకల్ప యాత్రలో భాగంగా సోమవారం బనగానపల్లె నియోజకవర్గంలోని గోవిందిన్నె గ్రామంలో వైయస్ జగన్ పాదయాత్ర నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు తమ సమస్యలు జననేతకు వివరించారు. ఈ సందర్భంగా వైయస్ జగన్ మాట్లాడుతూ..విద్యార్థులకు అండగా ఉంటానని, మీరు చదవండి, నేను ఫీజులు చెల్లిస్తానని హామీ ఇచ్చారు.