ముగిసిన 247వ రోజు ప్రజా సంకల్ప యాత్ర
27 Aug, 2018 19:12 IST
విశాఖ: వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్ మోహన్ రెడ్డి ప్రజాసంకల్పయాత్ర 247వ కొద్ది సేపటి క్రితమే ముగిసింది. సోమవారం ఉదయం జననేత అచ్యుతాపురం నైట్ క్యాంప్ శిబిరం నుంచి పాదయాత్ర ప్రారంభించి అక్కడి నుంచి అచ్యుతాపురం మండలంలోని అప్పన్న పాలెం, మదుటూరు జంక్షన్, సానికాలువ, చీమలపల్లి మీదుగా పాదయాత్ర సాగింది. భోజన విరామం అనంతరం బంగారం పల్లి క్రాస్ మీదుగా కొండకర్ల, కొండకర్ల జంక్షన్ వరకు పాదయాత్ర కొనసాగింది.