109వ రోజు ప్రజాసంకల్పయాత్ర షెడ్యూల్
10 Mar, 2018 19:45 IST
ప్రకాశం : ప్రజాసంకల్పయాత్ర 109వ రోజు షెడ్యూల్ ఖరారు అయింది. వైయస్ జగన్ మోహన్ రెడ్డి ఆదివారం ఉదయం చీరాల నుంచి పాదయాత్రను ప్రారంభించనున్నారు. అక్కడ నుంచి కొత్తపేట, ఆంధ్ర కేసరి జూనియర్ కళాశాల, బాలాజీ థియేటర్, పేరాల, ఐటీసీ, ఆదినారాయణ పురం చేరుకొని భోజన విరామం తీసుకుంటారు. అనంతరం అక్కడి నుంచి ఏపూరు పాలెం వరకూ ప్రజాసంకల్పయాత్ర కొనసాగనుంది. ఈ మేరకు వైయస్ఆర్ సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తలశిల రఘురాం శుక్రవారం సాయంత్రం పాదయాత్ర షెడ్యూల్ను విడుదల చేశారు.