800 కిలోమీటర్లకు చేరువలో పాదయాత్ర
10 Jan, 2018 14:08 IST
చిత్తూరు: వైయస్ జగన్ మోహన్ రెడ్డి చేపట్టిన ప్రజా సంకల్ప యాత్ర మరో మైలు రాయికి చేరువైంది. చిత్తూరు జిల్లా కలిమిచేను గ్రామం వద్ద 800 కిలోమీటర్ల మైలు రాయిని వైయస్ జగన్ దాటనున్నారు. ఈ సందర్భంగా గ్రామంలో పూలబాట వేసి, రోడ్డు వెంట ముగ్గులతో అందంగా అలకరించారు.