సంగం బైపాస్ నుంచి ప్రజాసంకల్పయాత్ర ప్రారంభం
7 Feb, 2018 11:01 IST
నెల్లూరు : వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్ మోహన్ రెడ్డి ప్రజాసంకల్పయాత్ర 82వ రోజు మొదలైంది. బుధవారం ఉదయం వైయస్ జగన్ ఆత్మకూరు నియోజకవర్గం సంగం బైపాస్ రోడ్డు నుంచి పాదయాత్రను ప్రారంభించారు. అక్కడి నుంచి కలిగిరి క్రాస్ రోడ్డు, తలుకురుపాడు క్రాస్ రోడ్డు మీదుగా కొరిమెర్ల క్రాస్ రోడ్డు వరకు పాదయాత్ర కొనసాగుతుంది. అనంతరం మధ్యాహ్నం 12 గంటలకు భోజన విరామం తీసుకుంటారు. మధ్యాహ్నం 2.45 గంటలకు పాదయాత్ర తిరిగి ప్రారంభమౌతుంది. హసనాపురం ఎంట్రెన్స్ చేరుకున్న తర్వాత వైయస్ జగన్ అక్కడ మైనార్టీలతో సమావేశమవుతారు. అనంతరం హసనాపురం మీదుగా దుండిగామ్ వరకు పాదయాత్ర కొనసాగుతుంది. రాత్రి అక్కడే బసచేస్తారు.