బాలసదన్లో వాటర్ ప్లాంట్ ఏర్పాటు
16 Nov, 2017 11:19 IST
కర్నూలు: వైయస్ జగన్ మోహన్ రెడ్డి రాకతో విద్యార్థుల నీటి సమస్య తీరింది. ప్రజా సంకల్ప యాత్రలో భాగంగా వైయస్ జగన్ గురువారం పెద్దచింతకుంటలో స్త్రీ, శిశు సంక్షేమ శాఖకు చెందిన బాలసదన్ను సందర్శించారు. ఈ సందర్భంగా విద్యార్థినులు వైయస్ జగన్కు తమ సమస్య చెప్పుకున్నారు. ఇందుకు స్పందించిన జననేత బాలసదన్లో మినరల్ వాటర్ ప్లాంట్లో ఏర్పాటు చేయాలని పార్టీ శ్రేణులకు సూచించారు.